ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కబ్జా కేసు.. పీఎస్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 12:13 PM

 BRS మాజీ MLA జీవన్‌ రెడ్డి 114 ఎకరాల ల్యాండ్‌ కబ్జా కేసులో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మోకిలా PSకు హాజరయ్యారు. గతంలో ల్యాండ్‌ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో జీవన్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్‌తో పాటు, అరెస్ట్‌ చేయొద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో, జీవన్‌ రెడ్డి శుక్రవారం మోకిలా PSలో హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa