ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం,,.మళ్లీ హైదరాబాద్‌ వాసులకు వేతలు తప్పవా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 07, 2025, 08:07 PM

తెలంగాణలో మళ్లీ వర్షాలు కురువనున్నట్టు ప్రకటన చేసిన వాతావరణ శాఖ రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  ఇక.. హైదరాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలిచే అవకాశాలు ఉండనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాగా.. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే చిరుజల్లులు కురియగా వాతావరణం చల్లబడింది. కాగా.. మరో రెండు గంటల్లో వర్ష సూచన ఉండటంతో.. ఉద్యోగస్తులు, నగరవాసులు సమయానుకూలంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని.. తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.


ఇదిలా ఉంటే.. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా ఈరోజు (ఏప్రిల్ 7), రేపు (ఏప్రిల్ 8) తేదీల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాట ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏప్రిల్ 7వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురియనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa