ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేసవి రద్దీ.. తిరుపతికి 32 ప్రత్యేక రైళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 10:44 AM

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి 32 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్‌, మే నెలల్లో వారానికి రెండు చొప్పున నడపనున్నట్లు పేర్కొంది.
సర్వీస్ వివరాలు ఇలా..
రైలు నెం-07017 (చర్లపల్లి - తిరుపతి) ఏప్రిల్ 11, 13, 18, 20 మరియు మే 4, 9 తేదీలలో రాత్రి 10:35 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి ఉదయం 10:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ సర్వీస్ ఏప్రిల్ 6వ తేదీన కూడా కల్పించారు. ఇక రైలు నెం-07018 (తిరుపతి - చర్లపల్లి) ఏప్రిల్ 12, 14, 19, 21, 26, 28.. మే 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీలలో తిరుపతి నుండి సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరి ఉదయం 7:10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ సర్వీస్ కూడా ప్రయాణికులకు ఏప్రిల్ 7వ తేదీన కల్పించారు. మొత్తం 32 రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa