ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 01:03 PM

ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి రాజీవ గాంధీ నగర్ లో శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కోర్పిరేటర్ సుజాత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే" గారి జీవితం బహుజనుల స్ఫూర్తిదాయకం స్త్రీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు, వితంతు పునర్వివాహాలు, సమాజంలోని కుల జాడ్యాన్ని రూపుమాపేందుకు 'సత్యశోధన   సమాజ్' స్థాపన మరియు బ్రాహ్మణ వాదం నశించాలి బహుజన వాదం వర్ధిల్లాలి అనే వంటివి పూలే గారి కృషికి ప్రతీకలు .ఈ కార్యక్రమంలో ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు  ప్రవీణ్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చెన్న కేశవ ,సూరి, అరవింద్, వర్ధన్, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa