ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 22, 2025, 08:51 PM

కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా మే 20వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణం పోతులపల్లి లోని పీఎస్ఆర్ గార్డెన్ లో కార్మిక సంఘాల నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు ఐఎన్ టియుసి, ఎఐటీయుసీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa