ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిషన్ భగీరథ సూపర్‌వైజర్‌పై ఫిర్యాదు.. నల్లా కనెక్షన్ కోసం డబ్బుల డిమాండ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 02:33 PM

తాండూరు మండలం రాజీవ్ నగర్‌కు చెందిన కిష్టాపూర్ గ్రామస్తులు, మిషన్ భగీరథ గ్రిడ్ సూపర్‌వైజర్ నల్లా కనెక్షన్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్ నేతృత్వంలో గ్రామస్తులు కలిసి వినతి పత్రం సమర్పించారు. 
ఉచితంగా అందించాల్సిన నల్లా కనెక్షన్‌ కోసం సూపర్‌వైజర్ ఒక్కొక్కరి నుంచి రూ.3,500 వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa