ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరూర్ నగర్‌లో ఆపరేషన్ సింధు విజయం సంబరాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 01:27 PM

పాకిస్తాన్‌లోని పేహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధు విజయవంతం కావడంతో సరూర్ నగర్ డివిజన్‌లో బుధవారం బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టపాసులు కాల్చి, సంబరాలు చేసుకున్నారు. 
పాకిస్తాన్ జెండాకు చెప్పుల దండ వేసి, పాకిస్తాన్‌తో పాటు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa