ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారిని అదుపులోకి తీసుకోండి.... సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 07:16 PM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం కేంద్ర ప్రభుత్వం.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దేశప్రజలంతా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో రాజకీయాలకు తావు లేదన్నారు. దేశ భద్రత, ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం తరఫున చేపట్టాల్సిన చర్యలపై సీఎం కీలక సూచనలు చేశారు. ఈ సమయంలో ప్రజలకు మనమంతా భారత సైన్యంతో ఉన్నామనే స్పష్టమైన సందేశం వెళ్లాలన్నారు. రాజకీయాలకు, పార్టీ లకు తావు లేకుండా మొత్తం యంత్రాంగం ఒక్కటిగా పని చేయాలని స్పష్టం చేశారు.


ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యవసర సర్వీస్‌లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.


మంత్రులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి..


మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షల్లో పాల్గొనాలని, విదేశీ పర్యటనలు తక్షణమే రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించాలని ఆదేశించారు.


అలాంటి పని చేస్తే కఠిన చర్యలు..


ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. అత్యవసర మెడిసిన్, ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిలువలు సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు. రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలని సూచించారు. భద్రత పెంచండి:


ఆ సంస్థల వద్ద భద్రత పెంచండి..


అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలని శాంతిభద్రతలకు భంగం కలుగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. నగరంలో ఉన్న అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల వద్ద భద్రత పెంచాలని సూచించారు.


హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ సెక్యూరిటీ మీద దృష్టి సారించాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలని హిస్టరీ షీటర్ లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలించారు. ఇక పహల్గామ్‌ ఉగ్రదాడితో పాకిస్థాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా మే 7 (బుధవారం)న సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎంపిక చేసిన నగరాల్లో వీటిని నిర్వహించున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa