ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోచంపల్లిని సందర్శించిన 25 ఆఫ్రికా దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 15, 2025, 08:43 PM

భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం సాయంత్రం మిస్ వరల్డ్ పోటీదారులు దర్శించుకున్నారు. ఆలయ అతిథి గృహం నుంచి ప్రత్యేక బ్యాటరీ వాహనాల్లో కొండపైకి చేరుకున్న ఈ సుందరీమణులు, అఖండ దీపారాధన మండపంలో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సుందరీమణుల పర్యటన సందర్భంగా అక్టోపస్, తెలంగాణ స్పెషల్ పోలీస్ దళాలు, ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.మరోవైపు, టూరిజం విలేజ్‌గా ప్రసిద్ధి చెందిన పోచంపల్లిని ఆఫ్రికా ఖండంలోని 25 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. గ్రామానికి విచ్చేసిన ఈ విదేశీ అతిథులకు స్థానిక ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇక్కత్ చీరల విశిష్టతను, వాటి తయారీ విధానాన్ని సుందరీమణులు ఆసక్తిగా పరిశీలించారు. అంతేకాకుండా, కొందరు పోటీదారులు స్వయంగా మగ్గంపై చీరలు నేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ద్వారా పోచంపల్లి చేనేత కళ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa