ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో శుక్రవారం (మే 16, 2025) దారుణ ఘటన చోటుచేసుకుంది. గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న చీకటి దీప్తి (28) తల్లిదండ్రుల మందలింపుతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
మే 14న దీప్తి కలుపు మందు తాగినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించింది. ఈ ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |