తల్లిదండ్రులు మందలించారని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. చీకటి దీప్తి(28) గంగారంలో సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తల్లిదండ్రులు మందలించారని మనస్థాపంతో ఈ నెల 14న కలుపు మందు తాగింది. శుక్రవారం వేకువజామున పరిస్థితి విషమించి మరణించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |