సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు తండా గ్రామంలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారులు ఇల్లు కూల్చివేయడంతో బానోత్ సంతోష్ అనే యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
గ్రామస్తుల వివరాల ప్రకారం, సంతోష్ ఇటీవల కట్టుకున్న ఇంటిని అటవీశాఖ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన సంతోష్ ఆత్మహత్యాయత్నం చేయగా, వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అధికారుల నుంచి సమగ్ర సమాచారం అందాల్సిన అవసరం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa