ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జడ్చర్లలో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 01:28 PM

జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ పేటలో గల శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం గణపతి, ధ్వజస్తంభ, నవగ్రహ ప్రతిష్ట మరియు గర్భలయం రాజగోపురంపై కళశ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరయ్యారు. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa