ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోన్‌లో “ఒకే దేశం - ఒకే ఎన్నికలు” కార్యాశాల నిర్వహణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 01:55 PM

మంచిర్యాల జిల్లా సోన్ మండల కేంద్రంలో మంగళవారం “ఒకే దేశం - ఒకే ఎన్నికలు” అనే అంశంపై కార్యశాల నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోరిపల్లి శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ, “ఒకే దేశం - ఒకే ఎన్నికలు” అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ విధానంతో ఖర్చు తగ్గింపు, పరిపాలన సౌలభ్యం, ప్రజలపై భారం తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వివరించారు.
కార్యశాలలో మండల అధ్యక్షుడు మాల గంగారెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, కన్వీనర్ సందుగారి నవీన్, కో కన్వీనర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యశాల ద్వారా ప్రజల్లో ఈ అంశంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa