బొల్లారం : పటాన్చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ ఆర్థిక సహకారం అందిస్తున్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బొల్లారం మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయం నిర్మాణానికి తన వంతు సహాయంగా ఎమ్మెల్యే జిఎంఆర్ 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు పది లక్షల రూపాయల విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాల కాలంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు పట్టణాలు డివిజన్ల పరిధిలో సొంత నిధులతో 200 లకు పైగా దేవాలయాలు నిర్మించినట్లు తెలిపారు. పురాతన ఆలయాలను సైతం జీర్నో ధారణ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరిలో దైవం భక్తి పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిన్నారం మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ హనుమంత్ రెడ్డి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, గ్రామ పుర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa