జగిత్యాల జిల్లా నగునూరు, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్లలోని పర్యావరణాన్ని పచ్చగా ఉంచడమే లక్ష్యంగా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రత్యేక శిబిరంలో భాగంగా మంగళవారం పచ్చదనం మరియు పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. మూడు యూనిట్ల వాలంటీర్లు ఇందులో చురుకుగా పాల్గొని గ్రామాలలో పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. పడాల తిరుపతి మాట్లాడుతూ, "పరిశుభ్రత, పచ్చదనం అనేవి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అత్యంత అవసరం. ఇది ఒక్కరిమీద కాకుండా ప్రతి ఒక్కరిలోనూ బాధ్యతగా ఉండాలి" అని చెప్పారు. ఆయనతో పాటు డాక్టర్ అర్జున్ కూడా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ వాలంటీర్లను ప్రోత్సహించారు.
గ్రామస్తుల్లో చైతన్యం సృష్టిస్తూ, వారి సహకారంతో వాలంటీర్లు చెత్త నివారణ, మొక్కల నాటే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విధంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమాజం పట్ల తమ బాధ్యతను చాటిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa