ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోషామహల్ ధర్నాపై కాంగ్రెస్ నేత దయాకర్ విమర్శలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 07:28 PM

గోషామహల్‌లో బీఆర్ఎస్ నేత కవిత నిర్వహించిన ధర్నాపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కవిత ధర్నా స్వార్థపూరితమని, తన తండ్రి కేసీఆర్‌కు దగ్గర కావడానికి ఆమె ఈ డ్రామా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
దయాకర్ మాట్లాడుతూ, "కాళేశ్వరం కాదు, ఇది కులేశ్వరం ప్రాజెక్టు. ఇది తాగునీటి పథకం కాదు, మట్టి తినిపించే పథకం. NDSA ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపింది" అని అన్నారు. కేసీఆర్ హయాంలో కట్టిన ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరగలేదని ఆరోపించారు.
"కవిత ధర్నాను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆమె తండ్రి కేసీఆర్‌కు మార్కులు కొట్టించేందుకు, ప్రజల్లో మాయచేసేందుకు బీఆర్ఎస్ నాటకం చేస్తోంది" అని దయాకర్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa