ప్రథమ విడత ఇళ్లకు పేదలకే ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇళ్లు పథకం కింద, తొలి విడతలో పూర్తిగా పేదలకు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల తొలివిడత లబ్ధిదారులుగా పేదలు మాత్రమే ఎంపికవుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
పూరిగుడిసెల్లో ఉండే వారికే మొదటి ప్రాధాన్యత
బుధవారం ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. పూరిగుడిసెలో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. వారి జీవన స్థితిగతులు మెరుగుపడేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు చేరేలా నడిపిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం మాత్రమే కాకుండా, ఇతర పథకాలు కూడా సమర్ధవంతంగా అమలవుతున్నాయన్నారు. పేదల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa