కమీషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ల వినియోగాన్ని నిషేధించినట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఈనెల 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా వినియోగించదలచినట్లయితే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని కోరారు. సంబంధిత పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa