ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా తగ్గినా, ఇంకా చూపుతున్న దాని ప్రభావం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 04:54 PM

కరోనా మహమ్మారి వచ్చి తగ్గాక కూడా దాని ప్రభావాలు చాలామందిని వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వాసన పసిగట్టే శక్తి తగ్గిపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. అయితే, చాలామందికి తమకు ఈ సమస్య ఉన్నట్టు కూడా తెలియకుండానే ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నారని ఒక తాజా అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వాసన శక్తి తగ్గిపోయిందని భావిస్తున్న వారే కాకుండా, తమకు ఎలాంటి సమస్యా లేదనుకుంటున్న వారిలోనూ ఈ లోపం ఉన్నట్టు తేలింది.అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ హెల్త్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా, 40 రకాల వాసనలను గుర్తించే ఒక ప్రత్యేకమైన పరీక్షను ఉపయోగించారు. కోవిడ్ సోకిన తర్వాత తమ వాసన పసిగట్టే సామర్థ్యంలో మార్పు వచ్చిందని చెప్పిన వారిలో 80 శాతం మంది, దాదాపు రెండేళ్ల తర్వాత జరిపిన ఈ పరీక్షలో చాలా తక్కువ స్కోరు సాధించారు. వీరిలో 23 శాతం మంది వాసనను గుర్తించే శక్తిని తీవ్రంగా లేదా పూర్తిగా కోల్పోయినట్టు స్పష్టమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa