ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాంకేతిక లోపంతో రెండు గంటల పాటు నిలిచిపోయిన ఫలక్‌నమా ఎక్స్‌ప్రెస్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 04:41 PM

హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నమా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో సుమారు రెండు గంటల పాటు నిలిచిపోయింది. హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12703) ఈ ఉదయం మిర్యాలగూడ వద్దకు చేరుకోగానే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఉదయం 7:30 గంటల సమయంలో రైలును అక్కడే నిలిపివేశారు. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మరమ్మతు బృందాలు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, మరో ఇంజిన్‌ను ఘటనా స్థలానికి తెప్పించారు. పాత ఇంజిన్‌ను తొలగించి, కొత్త ఇంజిన్‌ను రైలుకు అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. అనంతరం ఉదయం 9:30 గంటలకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ తిరిగి సికింద్రాబాద్‌కు తన ప్రయాణాన్ని కొనసాగించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa