అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక మహిళలకు నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారని, ఈ లెక్కన ప్రతి అక్కాచెల్లెకు కాంగ్రెస్ పార్టీ 55,000 బాకీ పడిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్లో మహిళలకు 55,000 ఇచ్చి ఓటు అడగాలని రేవంత్ రెడ్డిని సూచించారు. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తానని మోసం చేశారని, పేదల ఇళ్లు కూలగొట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రతి బస్తీకి బస్తీ దవాఖానా, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు వంటి పథకాలు తెచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ గొంతు నొక్కడంలో ఒకటేనని బుధవారం విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa