ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాస్టల్ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 10:29 AM

పాపన్నపేట మండల కేంద్రంలోని హాస్టల్ ను ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పాపయ్య, మండల అధ్యక్షులు పర్వయ్య పర్యటించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. కాస్మోటిక్, మెస్ ఛార్జీలను వెంటనే సకాలంలో చెల్లించాలని, విద్యార్థులకు స్వేటర్లు, బ్లాంకెట్స్ ఇవ్వాలని గురువారం వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో అన్ని సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్, క్రిష్, గణేష్, విక్రమ్ లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa