TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తిని భార్యను హతమార్చాడు. సీతా గొంది గ్రామానికి చెందిన సిడాం సంతోష్ మద్యం తాగి గురువారం భార్య లక్ష్మిబాయితో గొడవపడ్డాడు. క్షణికావేశంలో భార్యపై గొడ్డలితో దాడి చేయగా.. లక్ష్మీబాయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భార్యను హతమార్చిన తర్వాత భర్త సంతోష్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa