ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 07:33 PM

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీకి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు.ఈ కీలక సమావేశానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీతా లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి వంటి ముఖ్య నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, ముఖ్యంగా ఇంటింటి ప్రచారం, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరే నాయకుల అంశాలపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించినట్టు సమాచారం. ఉప ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులందరినీ సమాయత్తం చేయాలని ఈ సమావేశంలో కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa