ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 04:54 PM

దేశంలో పండగ సీజన్ వేళ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అక్టోబరు నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 1.96 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 4.6 శాతం అధికమని శనివారం విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడించాయి.వరుసగా పదో నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ. 1.8 లక్షల కోట్ల మార్కును దాటడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY26) ఏప్రిల్-అక్టోబరు మధ్య కాలంలో జీఎస్టీ వసూళ్లు 9 శాతం పెరిగి రూ. 13.89 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ మొత్తం రూ. 12.74 లక్షల కోట్లుగా ఉంది. రీఫండ్‌లను మినహాయించిన తర్వాత, అక్టోబరులో నికర పన్ను వసూళ్లు రూ. 1.69 లక్షల కోట్లుగా నిలిచాయి.సెప్టెంబరు 22న చేపట్టిన రేట్ల హేతుబద్ధీకరణ తర్వాత పండగ సీజన్‌లో వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ కనిపించిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించడం వల్లే ఇది సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది వినియోగం 10 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల అదనంగా రూ. 20 లక్షల కోట్ల మేర కొనుగోళ్లు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa