ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందెశ్రీ మృతి పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 03:55 PM

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రూపశిల్పి అందెశ్రీ ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తెలంగాణ సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందెశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో తన పాటలతో, సాహిత్యంతో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉద్యమ కాలంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa