తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రూపశిల్పి, ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ (61) సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి గుండెపోటు కారణమని గాంధీ ఆసుపత్రి వైద్యులు అధికారికంగా నిర్ధారించారు. లాలాగూడలోని తన నివాసంలో తెల్లవారుజామున కుప్పకూలిపోయిన ఆయన్ను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.గాంధీ ఆసుపత్రి హెచ్వోడీ డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ సింధూర ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. అందెశ్రీ గత 15 ఏళ్లుగా తీవ్రమైన రక్తపోటు (హైపర్టెన్షన్) సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అయితే, గత నెల రోజులుగా ఆయన రక్తపోటును నియంత్రించే మందులను వాడటం లేదని కుటుంబసభ్యుల ద్వారా తెలిసిందన్నారు. గత మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన ఆసుపత్రికి వెళ్లలేదని పేర్కొన్నారు.ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయిన ఆయన, సోమవారం తెల్లవారుజామున బాత్రూమ్ వద్ద పడిపోయి కనిపించారు. కుటుంబసభ్యులు చూసేసరికి ఆయన మరణించి దాదాపు ఐదు గంటలు గడిచి ఉండవచ్చని డాక్టర్ సింధూర అంచనా వేశారు. ఆరోగ్యం విషయంలో ఆయన చూపిన నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారితీసిందని వైద్యులు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa