ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న రాజమౌళి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 03:37 PM

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా, ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన భార్య రమతో కలిసి వచ్చి ఓటేశారు.షేక్‌పేట్‌ డివిజన్‌ పరిధిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి రాజమౌళి దంపతులు సాదాసీదాగా విచ్చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ ఓటర్లలాగే క్యూలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు."ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ ఎంతో విలువైనది. దేశ భవిష్యత్తును మన ఓటే నిర్దేశిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి. ఇది కేవలం మన బాధ్యతే కాదు, మన హక్కు కూడా" అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa