ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ఇల్లు ప్రారంభోత్సవంలో తగిన సొమ్ములు ఇవ్వలేదని యజమానిపై దాడికి పాల్పడిన హిజ్రాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 03:42 PM

కీసర మండలం చీర్యాల్ లో దారుణం చోటుచేసుకుందీ . వివరాల్లోకి వెళితే..చీర్యాల్ లోని శ్రీబాలాజీ ఎన్క్లేవ్‌‌‌ లో‌‌‌‌‌ ప్రమిదల సదానందం ఇటీవల కొత్త ఇల్లు కట్టుకున్నాడు. బంధుమిత్రుల సమక్షంలో సంతోషంగా గృహప్రవేశం నిర్వహించాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటిముందు సదానందం పనిచేస్తుండగా ఇద్దరు హిజ్రాలు వచ్చారు. కొత్త ఇల్లు కట్టుకున్నారు మాకు డబ్బులు ఇవ్వాలని అడిగారు. ఎంతోకొంత ఇచ్చి పంపిద్దామని చూస్తే ఒప్పుకోలేదు. రూ.లక్ష ఇవ్వాలని పట్టుబట్టారు. అంత మొత్తం ఇవ్వలేనని సదానదం చెప్పడంతో అసభ్యంగా దూషించి వెళ్లిపోయారు.కాసేపటి తర్వాత మూడు ఆటోల్లో 15 మంది హిజ్రాలు వచ్చారు. ఇంటి గేటును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. శబ్దం విని బయటకు వచ్చిన సదానందంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ గొడవను గమనించి చుట్టుపక్కల వారు రావడంతో హిజ్రాలు పారిపోయారు. హిజ్రాల దాడిలో గాయపడ్డ సదానందం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాక కీసర పోలీస్‌ ‌‌‌‌‌‌‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa