ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనపై అమిత్ షా సమీక్షా సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 03:46 PM

రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఐబీ డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ దాతే హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఘటన జరిగిన సోమవారం రాత్రి అమిత్ షా స్వయంగా ఎర్రకోట వద్ద పేలుడు సంభవించిన ప్రాంతాన్ని సందర్శించి, అనంతరం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుప‌త్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa