జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్, ఎగ్జిట్ పోల్ ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోందని ఆయన జోస్యం చెప్పారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా నవీన్ యాదవ్ వైపు నిలిచారని ఆయన పేర్కొన్నారు.ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను ముందుండి నడిపించారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తారని, ఆయన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ టీపీసీసీ చీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో తాము సఫలీకృతం చెందామని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa