ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూటాన్ పర్యటన ముగించుకున్న మోడీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 04:32 PM

ప్రధాని నరేంద్ర మోదీ తన రెండ్రోజుల భూటాన్ పర్యటనను ముగించుకున్నారు. పర్యటనలో భాగంగా చివరి రోజు బుధవారం థింఫులో భూటాన్ నాలుగో రాజు (డ్రూక్ గ్యాల్పో) జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌తో సమావేశమయ్యారు. అనంతరం కాలచక్ర కార్యక్రమంలో పాల్గొని న్యూఢిల్లీకి తిరుగు ప‌య‌న‌మయ్యారు. 'నైబర్‌హుడ్ ఫస్ట్' (ఇరుగుపొరుగుకే తొలి ప్రాధాన్యం) విధానానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన మరోసారి చాటి చెప్పింది.అంతకుముందు మంగళవారం ప్రధాని మోదీ, భూటాన్ ప్రస్తుత రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఇంధనం, కనెక్టివిటీ, సాంకేతికత, రక్షణ, భద్రత వంటి పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు సమీక్షించారు. చర్చల అనంతరం భారత్-భూటాన్ భాగస్వామ్యంతో నిర్మించిన 1020 మెగావాట్ల పునత్‌సాంగ్‌ఛు-II జల విద్యుత్ ప్రాజెక్టును ఇద్దరు నేతలు కలిసి ప్రారంభించారు. ఇది ఇరు దేశాల మధ్య ఇంధన రంగంలో బలపడుతున్న బంధానికి నిదర్శనంగా నిలిచింది.ఈ సమావేశంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. "భూటాన్ రాజుతో సమావేశం చాలా ఫలప్రదంగా జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని అంశాలపై చర్చించాం. భూటాన్ అభివృద్ధి ప్రయాణంలో భారత్ ఒక కీలక భాగస్వామి కావడం మాకు గర్వకారణం" అని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa