ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ కార్యకర్త రాకేశ్ ఇంటికి వెళ్లిన కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 03:00 PM

జూబ్లీహిల్స్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, గుండాయిజం మొదలుపెట్టిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్త రాకేశ్‌పై జరిగిన దాడిని ఖండించిన ఆయన, తాము పదేళ్ల పాలనలో ప్రతిపక్షాలపై ఎప్పుడూ దాడులు చేయలేదని అన్నారు. జూబ్లీహిల్స్‌లోని రహమత్‌నగర్‌లో గాయపడిన రాకేశ్‌ను కేటీఆర్‌ పరామర్శించి, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa