ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటరు జాబితాలో పేరు మాయం: హైకోర్టును ఆశ్రయించిన సర్పంచ్ అభ్యర్థి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 03:05 PM

నల్గొండ జిల్లా దామరచర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఓటరు జాబితాలో తమ పేర్లు లేవని ఆరోపిస్తూ ఓటరు బంటు రేణుక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డీఎస్పీ కుమార్తె అయిన రేణుక, ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే, ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు సూచన మేరకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. పిటిషన్‌పై రెండు రోజుల్లో విచారణ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa