ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమ్మంలో గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 10:31 PM

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఖమ్మం జిల్లాలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ రోజు ఆయన జిల్లాలోని వైరా నియోజకవర్గం, కొనిజర్ల మండలంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు.ఆయన వసతి సౌకర్యాలు బోధన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa