ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు ప్రమాదం.. కాగజ్నగర్‌కు చెందిన నలుగురు మహిళల దుర్మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 25, 2025, 02:19 PM

కాగజ్నగర్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్‌కు వైద్యం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా, బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేవాడ సమీపంలోని బ్రిడ్జిపై కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ఘోర ప్రమాదంలో జాకీర్ భార్య సల్మా బేగం, కూతురు శబ్రీమ్, బంధువులు ఆఫ్జా బేగం, సహార మృతి చెందారు. ఘటన స్థలంలోనే ముగ్గురు మహిళలు, ఒక బాలిక ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చంద్రపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa