ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 10:29 AM

పటాన్‌చెరు పట్టణంలో  జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్‌కు వేదిక కానుంది. మైత్రి మైదానంలో జనవరి 4వ తేదీన నిర్వహించనున్న జీఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు యువతకు ప్రేరణగా నిలవనున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను గురువారం సాయంత్రం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, యువత శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు మానసికంగా క్రమశిక్షణ కలిగి ఎదగాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి యువత వ్యాయామం, క్రీడలను జీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో తొలిసారిగా జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల నిర్వహణ గర్వకారణమని పేర్కొన్న ఆయన, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకొని క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.*


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa