ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిసాన్ సమృద్ధి యోజన కింద పెరిగిన రైతు భరోసా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 11:42 AM

కిసాన్ సమృద్ధి యోజన కింద రైతులకు ఏటా కేటాయించే మొత్తాన్ని రూ. 6000 నుంచి రూ. 10,000కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చింతకుంట గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు, రైతులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, తెలంగాణలో బీజేపీ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజెవైఎం కథలాపూర్ మండల అధ్యక్షులు ఆరే శివఅందె వినోద్, బోదాసు కమలాకర్, అన్నం మహేష్, కోరుట్ల రాజేష్, రవి, రాజారెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa