ఢిల్లీలో 2026 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకల కవాతులో చారిత్రాత్మకంగా సరికొత్త అరంగేట్రం జరగనుంది. ఈసారి సైన్యంలోని నాలుగు కాళ్ల యోధులు, అంటే శునకాలు, ఒంటెలు, పోనీలు, రాప్టర్లు తొలిసారిగా కవాతులో పాల్గొననున్నాయి. తీవ్రమైన భూభాగాల్లో సైనిక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ జంతువులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (ఆర్.వీ.సీ) విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులను ఈ కవాతులో ప్రదర్శించనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa