మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని ఊరుకొండపేట గ్రామ శివారులో ఉన్న శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీణాదరి, ఈవో సత్య చంద్రారెడ్డి, చైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి షిరిడి సాయి సేవ బృందం, పాలక మండలి సభ్యులు, ఎస్ఐ కృష్ణదేవ, ఊర్కొండ సర్పంచ్ మ్యాకల మంజుల శ్రీనివాసులు, గ్రామ పెద్దలు, యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఆదాయ వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa