ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Vande Bharat Express: ప్రయాణికులకు కీలక సమాచారం.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్‌లో మార్పులు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 10:55 PM

హిందూపూర్ రైల్వే స్టేషన్‌లో ఆగే కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో నైరుతి రైల్వే (South Western Railway) మార్పులు చేసింది. రైళ్ల సమయపాలనను మెరుగుపరచడం, కార్యకలాపాలను మరింత సవ్యంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త టైమింగ్స్ మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి.యశ్వంతపూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20704) హిందూపూర్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుకుని, 3.57 గంటలకు బయలుదేరుతుంది. ముందుగా ఈ రైలు 3.48 గంటలకు వచ్చి, 3.50 గంటలకు బయలుదేరేది.అదే విధంగా కాచిగూడ – యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20703) హిందూపూర్‌కు మధ్యాహ్నం 12.17 గంటలకు చేరుకుని, 12.19 గంటలకు బయలుదేరుతుంది. ఇంతకుముందు ఇది 12.08 గంటలకు చేరుకుని, 12.10 గంటలకు బయలుదేరేది.ప్రయాణికులు ఈ కొత్త సమయాలను గమనించి తమ ప్రయాణాలను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రైళ్ల ఆలస్యాన్ని తగ్గించి, సేవలను మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు తెలిపారు.ఇక యశ్వంతపూర్–కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో ఆరు రోజులు మాత్రమే నడుస్తుంది. బుధవారం ఈ రైలు సేవలు ఉండవు. ఈ ట్రైన్ కాచిగూడ నుంచి బయలుదేరి మహబూబ్‌నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ మార్గంగా యశ్వంతపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa