ఏపీ మాజీ జగన్కు హామీలపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తెలిపారు. హామీలు అమలు చేస్తే 11 సీట్లే ఎందుకు వచ్చాయో.. జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదని సోము హితవు పలికారు. తిరుమల లడ్డూ కల్తీ గుర్తించి మాట్లాడే ముందు.. రూ.350కి కిలో నెయ్యి ఎలా వస్తుందో చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు.ఏపీలో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఉన్నాం.. పూర్తిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.. నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారని వెల్లడించారు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిందని జగన్ మాట్లాడడం, కోడిగుడ్డుపై ఈకలు పీకటం లాంటిదే అని దుయ్యబట్టారు.. మరోవైపు, సరైన రీతిలో వైఎస్ జగన్ ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు
![]() |
![]() |