ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 28న భారత్‌లో కనువిందు, మళ్లీ 15 ఏళ్ల తర్వాతే

Technology |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2025, 10:20 PM

ఈనెల 28వ తేదీన ఆకాశంలో మరో ఖగోళ అద్భుతం చోటు చేసుకుంది. అయితే ఈ అద్భుతం చూసే అవకాశం భారత్‌లోనూ కలగనుంది. అయితే ఈ అద్భుతం మళ్లీ 15 ఏళ్ల తర్వాత అంటే 2040లోనే ఆవిష్కృతం కానుంది. ఈనెల 28వ తేదీన (శుక్రవారం) సౌర కుటుంబంలో ఉన్న 7 గ్రహాలు ఒకే వరుసలో వస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బుధుడు, శుక్రుడు, శని, అంగారకుడు, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలన్నీ ఒకే లైన్‌లో దర్శనం ఇవ్వనున్నాయి. ప్లానెట్ పరేడ్‌గా పిలిచే ఈ ఖగోళ అద్భుతం దృశ్యాన్ని భారత్‌లోనూ చూసే అవకాశం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే దీన్ని టెలిస్కోప్ అవసరం లేకుండానే ఈ ఖగోళ అద్భుతాన్ని చూడొచ్చని తెలిపారు.


భారత్‌తోపాటు అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లోనూ ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూడగలరని పేర్కొన్నారు. తిరిగి ఈ ఖగోళ అద్భుత దృశ్యం 2040లో కనిపించనుందని వివరించారు. అయితే గత నెలలో కూడా ఈ ప్లానెట్ పరేడ్ ఆకాశంలో కనువిందు చేసింది. జనవరి నెలలో వారం రోజుల పాటు 7 గ్రహాలు ఒకే వరుసలోకి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈనెల 28వ తేదీన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత శని, మెర్క్యురీ, నెప్ట్యూన్, వీనస్, యురేనస్, బృహస్పతి, మార్స్ గ్రహాలు ఆకాశంలో ఒకే వరుసలోకి వస్తాయని పేర్కొన్నారు.


 అయితే ఈ 7 గ్రహాల్లో బుధుడు, శుక్రుడు, బృహస్పతి, అంగారకుడు, శని.. 5 గ్రహాలు ఎలాంటి బైనాక్యులర్స్ సాయం లేకుండా నేరుగా కంటితో చూస్తే సులభంగా కనిపిస్తాయని తెలిపారు. కానీ యురేనస్, నెప్ట్యూన్ మాత్రం బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోప్‌ ద్వారా చూడగలరని పేర్కొ్న్నారు. సౌర కుటుంబంలో ప్రధానంగా 8 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ వివిధ వేగాలతో నిత్యం తిరుగుతూ ఉంటాయి. ఇందులో సూర్యుడికి అత్యంత సమీపంలో బుధగ్రహం ఉంటుంది.


కాబట్టి ఈ బుధుడు.. 88 రోజుల్లోనే సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేసుకుంటుంది. ఇక సూర్యుని చుట్టూ భూమి తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. ఇక అన్ని గ్రహాల కంటే దూరంగా ఉన్న నెఫ్ట్యూన్‌కు సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 60,190 రోజులు పడుతుంది. అంటే ఒక భ్రమణానికి 165 ఎర్త్ ఇయర్స్ పడుతుంది. ఇలా ఒక్కో గ్రహం వేర్వేరు వేగాలతో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుండటం వల్ల.. సూర్యునికి ఒక దిశలో వరుసగా రావడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com