ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 01:01 PM

మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శలు చేశారు. మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ(శనివారం) విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో షర్మిల మాట్లాడారు. స్త్రీ లేకపోతే జననం లేదు... గమనం లేదు. అసలు సృష్టే లేదని ఉద్ఘాటించారు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళ అని కొనియాడారు. స్త్రీ ఎక్కడ గౌరవం పొందుతుందో ఆ ఇల్లు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని విమర్శించారు. మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదని వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. ఓటు బ్యాంక్ కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద బీజేపీ లెక్కగట్టిందని వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. వికసిత భారత్‌లో గంటకు 50 మంది మహిళలపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 80 మంది మహిళలపై లైంగిక వేధింపులు జరగడం అత్యంత శోచనీయమని వాపోయారు. పేరుకే నారీశక్తి వందన్ ... కానీ ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని చెప్పారు. మహిళలను వేధించిన చరిత్ర బీజేపీ, దాని అనుబంధ సంఘాలదని ధ్వజమెత్తారు. మహిళల భద్రతపై ఎన్ని ఫాస్ట్రాక్ చట్టాలు. ఉన్నా... ఆచరణలో మహిళలకు న్యాయం శూన్యమని చెప్పారు. ఇటు రాష్ట్రంలో సైతం మహిళలకు గౌరవం లేదని వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa