మండలిని, ఛైర్మన్ను అవమానిస్తున్నారన్న బొత్స వ్యాఖ్యలపై సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. భారత రాజ్యాగం ప్రకారం అత్యున్నతస్థానంలో ఉన్న ఛైర్మన్ పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు లేదని స్పష్టం చేశారు. మండలి ఛైర్మన్పై సీఎం చంద్రబాబుకు, మంత్రులు, సభ్యులకు తేలిక భావన ఎప్పుడూ లేదన్నారు. మండలి ఛైర్మన్ రాకపోతే సీఎం, ఉప ముఖ్యమంత్రి మండుటెండలో 10 నిముషాల సేపు నిలబడ్డారని చెప్పుకొచ్చారు. సీఎం వేచి చూసి మండలి ఛైర్మన్ వచ్చాకే ఫొటో సెషన్ను ప్రారంభించారని తెలిపారు. సభ పట్ల, సభాపతి పట్ల సీఎం ఇచ్చే గౌరవానికి నిన్నటి ఘటన నిదర్శనమన్నారు. సాంప్రదాయాలను పాటించాలని సీఎం చంద్రబాబు అందరికీ సూచించారన్నారు. నిన్న ప్రొటోకాల్ పరంగా ఏం జరిగిందనేది విచారణ చేస్తామని.. సభను, సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాట్లాడటం సరైంది కాదని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
![]() |
![]() |