ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌నే వెయిట్ చేయించిన పుతిన్.. గంటకు పైగా ఫోన్ పట్టుకునే కూర్చున్న అమెరికా అధ్యక్షుడు

international |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 10:13 PM

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలానే కష్ట పడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చించి ఆయన్ను నెల రోజుల పాటు కాల్పుల విరమణకు ఒప్పించిన ట్రంప్.. మంగళ వారం రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిముర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈక్రమంలోనే పుతిన్.. అమెరికా అధ్యక్షుడిని గంట సేపు వెయిట్ చేయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన లైన్‌లోకి వచ్చేందుకు 60 నిమిషాలకు పైగా సమయం తీసుకున్నట్లు సమాచారం. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఇటీవలే ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చించిన ట్రంప్.. నెల రోజుల పాటు కాల్పుల విరమణకు ఆయన్ను ఒప్పించారు. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ ఎలాంటి దాడులు చేయకుండా మిన్నుకుంటుండగా.. రష్యా మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తూనే వస్తోంది. అయితే తాజాగా ట్రంప్ మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చించారు. ముఖ్యంగా ఫోన్ చేసి మరీ ఆయనతో మాట్లాడారు. మంగళ వారం రోజు ఈ ఇద్దరు నేతలు గంటకు పైగా చర్చించుకోగా.. పుతిన్ ట్రంప్‌ను గంటసేపు నిరీక్షించేలా చేశారని తెలుస్తోంది.


ట్రంప్‌నే గంట సేపు వేయించారంటూ జాతీయ మీడియాలో కథనాలు రాగా.. దీనిపై రష్యా అధ్యక్షుడు ప్రెస్ సెక్రటరీ దిమిత్ర పెస్కోవ్ స్పందించారు. ట్రంప్ ఏ సమయంలో ఫోన్ చేస్తారనే విషయం తమ అధ్యక్షుడికి తెలియకపోవడం వల్ల ఈ అసౌకర్యం కల్గిందన్నారు. యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్.. వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన చర్చలు దాదారు 2 గంటలు ఆలస్యం అయ్యాయని అమెరికా అధ్యక్ష భవనం కూడా తెలిపింది.


3 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేయంలో భాగంగా ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు నిలిపి వేసేలా చూడాలని అమెరికా, రష్యా నిర్ణయించాయని పేర్కొంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించారు. పరస్పరన 175 మంది యుద్ధ ఖైదీలను బుధవారమే అప్పగించుకోనున్నట్లు తనకు పుతిన్ చెప్పారని ట్రంప్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన 23 మంది ఉక్రెయిన్ సైనికుల్ని కూడా రష్యా అప్పగించబోతుందన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com