ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేయని నేరానికి 55 ఏళ్లు జైలుశిక్ష.. తప్పు తెలుసుకుని బాక్సర్‌కు రూ.1200 కోట్లు చెల్లించిన జపాన్

international |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 07:56 PM

 అతడో ప్రొఫెషనల్ బాక్సర్. అయితే పదవి నుంచి విరమణ పొందిన తర్వాత ఓ చోట ఉద్యోగం చేశాడు. అక్కడే తన యజమాని కుటుంబం హత్యకు గురికాగా.. ఇతడే చేశాడంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై న్యాయస్థానం కూడా ఇతడికి మరణశిక్ష విధించింది. కానీ ఆ తర్వాత కేసులో లభించిన కొన్ని ఆధారాలతో బాక్సర్‌కు సంబంధం లేదని మరణశిక్షను రద్దు చేసింది. మరోవైపు కేసు విచారణను 5 దశాబ్దాలుగా కొనసాగిస్తోంది. కానీ బాక్సర్ మాత్రం జైల్లోనే ఉన్నాడు. దాదాపు 55 ఏళ్ల శిక్ష అనుభివించాకా అతుడు నేరం చేయలేదని.. కోర్టు నిర్ధారించింది. ఆపై ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ కథ చదివేయాల్సిందే.


ప్రస్తుతం 89 ఏళ్ల వయసు కలిగిన ఇవావో హకమాడా జపనీయుడు. చిన్నప్పటినుంచి అతడికి బాక్సింగ్ అంటే ఇష్టం కాగా.. బాగా నేర్చుకుని మంచి బాక్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 1961లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఇవావో హకమాడా పదవీ విరమణ పొందాడు. పొట్టకూటి కోసం సెంట్రల్ జపాన్‌లోని షిఝువోకాలోని సోయాబీన్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడే పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అతడు ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే యజమాని కుటుంబ సభ్యులు.. అదే ప్లాంట్ వద్ద హత్యకు గురయ్యారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడే ఉద్యోగం చేస్తున్న ఇవావో హకమాడాను అరెస్ట్ చేశారు. పూర్తిగా కేసును దర్యాప్తు చేయకుండానే పోలీసులు అతడే నిందితుడు అంటూ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం సైతం హకమాడానే నేరస్థుడిగా తేల్చింది. మృతుల వద్ద లభించిన రక్తపు మరకలు ఉన్న బట్టలను ప్రధాన సాక్ష్యంగా పరిగణించిన కోర్టు హకమాడాకు మరణ శిక్ష విధించింది. అయితే ఈ బట్టలను డీఎన్ఏ పరీక్షకు పంపంగా వాటిని మృతదేహాల వద్ద పోలీసులే ఉంచినట్లు తెలిసింది. దీంతో న్యాయస్థానం హకమాడా మరణ శిక్షను రద్దు చేసింది. కేసును లోతుగా దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసంది.


ఇలా అప్పటి నుంచి ఈ కేసు విచారణ సాగుతూనే వస్తోంది. కానీ నిందితుడిగా ఉన్న హకమాడా మాత్రం జైల్లోనే ఉన్నాడు. ఇలా 55 ఏళ్లుగా హకమాడా శిక్షను అనుభవిస్తుండగా.. తాజాగా కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. ఈక్రమంలోనే షిఝువోకా జిల్లా కోర్టు.. హకామాడాను నిర్ధోషిగా తేల్చి విడుదల చేసింది. అయితే చేయని నేరానికి అత్యంత సుదీర్ఘ కాలం జైలు జీవితాన్ని గడిపినందుకు గాను రోజుకు 85 డాలర్ల చొప్పున (భారత కరెన్సీ ప్రకారం రూ.12,300) నష్ట పరిహారంగా ఇవ్వాలాని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. ఇలా 55 ఏళ్లకు గాను 1.44 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1200 కోట్లు) ఇచ్చింది.


అయితే హకమాడా అనుభవించిన శిక్షతో పోలిస్తే ఈ డబ్బు చాలా తక్కువ అని.. ఏమిచ్చినా ఆయన బాధను, కోల్పోయిన జీవతాన్ని తిరిగి తీసుకురాలేమని హకమాడా తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీనిపై హకమాడా స్పందిస్తూ.. తన జీవితం అంతా జైల్లోనే గడిచిపోయిందని.. తానసలు నేరమే చేయలేదని, పోలీసులే బెదిరించి చేయని నేరాన్ని ఒప్పుకునే చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com