గుజరాత్లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. పంచమహాల్ జిల్లా షాహ్రా తాలూకాకు చెందిన పరిణీత అనే మహిళను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. బైక్ కచ్ వైరును గొంతుకు బిగించి ప్రాణం తీశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ అడవిలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |