టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కోళ్లతో వినూత్న నిరసన చేపట్టారు. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు చికెన్ సెంటర్ల నుంచి కేజీకి రూ.10 వసూలు చేస్తున్నారని భూమా అఖిలప్రియ ఆరోపించారు. పేపర్లో వచ్చే ధరకే చికెన్ ఇప్పిస్తామని గతంలో ప్రెస్మీట్లో చెప్పానని, దాని కోసం పోరాటం చేస్తుంటే.. కమీషన్ తీసుకుంటున్నానంటూ పేపర్లో నీచంగా రాస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కర్నూలులోని సాక్షి ఆఫీసు ఎదుట కోళ్లతో వినూత్న నిరసన తెలిపారు.గత వైసీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో భారీగా అవినీతి జరిగిందని కొద్దిరోజుల క్రితం భూమా అఖిల ప్రియ అన్నారు. వైసీపీ హయాంలో 120 కోట్ల రూపాయలతో క్రీడలు నిర్వహించామని గొప్పలు చెప్పుకున్నారని, క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించలేదని మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం ఏకంగా 35 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి ఇంకా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వలేదని పేర్కొన్నారు.
![]() |
![]() |